వెలుగు ఏపీడీ పై విచారణకు హాజరైన సీపీఎం నేతలు

CPM leaders attend inquiry at Palakonda Sub-Collector’s office, demanding a probe into Velugu APD corruption allegations.

వెలుగు ఏపీడీ వై. సత్యం నాయుడు పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో గతంలో సీపీఎం పార్టీ ఫిర్యాదు చేయగా, దీనిపై విచారణ చేపట్టేందుకు పాలకొండ సబ్ కలెక్టర్ పి. యశ్వంత్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సీపీఎం నేతలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిధుల ఖర్చు, కొనుగోలు చేసిన యంత్రాలు, సామగ్రిపై సమగ్ర దర్యాప్తు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, దావాల రమణమూర్తి మాట్లాడుతూ, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో వెలుగు ఏపీడీ కాలంలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. ముఖ్యంగా వన్ దన్ వికాస్ కేంద్రాలు, చింతపండు, జీడి పిక్కల కొనుగోలులో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.

కొమరాడ మండలంలో గిరిజన రైతుల వద్ద గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ, ఒక్క పిక్క కూడా కొనుగోలు చేయలేదని సీపీఎం నేతలు ఆరోపించారు. అన్ని మండలాల్లో యథావిధిగా జరుగుతున్న దుర్వినియోగంపై విచారణ జరిపించాలని, ప్రభుత్వ నిధుల వినియోగాన్ని పూర్తిగా పరిశీలించాలని డిమాండ్ చేశారు.

ఇందుకు తోడు రావికోన పంచాయతీలో మహిళలకు కుట్టు మిషన్ ట్రైనింగ్ పేరుతో ప్రభుత్వ నిధులను అనవసరంగా ఖర్చు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మొత్తం 58 వన్ దన్ వికాస్ కేంద్రాల్లో ఎక్కడా పనులు సరిగ్గా జరగడం లేదని, దీనిపై సీబీఐ లేదా విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని సీపీఎం నేతలు అధికారులను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *