Saturday, February 21, 2026
spot_img
HomeInterNationalభారత సరిహద్దుల్లో బంగ్లాదేశ్ టర్కీ డ్రోన్లు మోహరింపు

భారత సరిహద్దుల్లో బంగ్లాదేశ్ టర్కీ డ్రోన్లు మోహరింపు

పశ్చిమ బెంగాల్ సమీపంలోని సరిహద్దుల్లో టర్కీ తయారీ డ్రోన్లను బంగ్లాదేశ్ మోహరించిందన్న సమాచారంతో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దుల వద్ద నిఘాను పెంచడం మొదలు పెట్టింది. ఇది షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత, సరిహద్దు ప్రాంతాల్లో తీవ్రవాద కార్యకలాపాలు పెరిగినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం నేపథ్యంలో చోటుచేసుకుంది.

భారత సరిహద్దు సమీపంలో బంగ్లాదేశ్ టర్కీ తయారీ ‘బైరాక్టర్ టీబీ2 మానవరహిత వైమానిక వాహనాలను(యూఏవీలు) మోహరించిందని ఆర్మీ వర్గాలు ధ్రువీకరించాయి. బంగ్లాదేశ్ ఆర్మీ 67వ డివిజన్ ఈ డ్రోన్లను నిఘా కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నట్టు తెలిసింది. వీటిని రక్షణ అవసరాల కోసం మోహరించినప్పటికీ, అధునాతన డ్రోన్లు సున్నిత ప్రాంతాల్లో ఉంచడం భారత్ కోసం అప్రమత్తతను కలిగించింది.

ఉగ్రవాద గ్రూపులపై షేక్ హసీనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ, ఆమె భారత్‌కు పారిపోయిన తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో తీవ్రవాదులు మళ్లీ పుంజుకుంటున్నారని సమాచారం. ఈ ప్రాంతంలోని అస్థిర పరిస్థితులను తమ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకునేందుకు ఉగ్రవాద గ్రూపులు మరియు స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల హసీనా ప్రభుత్వ పతనంతో సరిహద్దు ప్రాంతాల్లో భారత వ్యతిరేక అంశాలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, అధునాతన యూఏవీ మోహరింపుతో నిఘా అవసరాన్ని గుర్తించిన భారత సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి, సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేయడం అవసరమని చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular