Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeCrime Newsపాక్ చెర నుంచి భారత మత్స్యకారులను కాపాడిన కోస్ట్ గార్డ్

పాక్ చెర నుంచి భారత మత్స్యకారులను కాపాడిన కోస్ట్ గార్డ్

-

Chat on WhatsApp

అరేబియా సముద్రంలో భారత కోస్ట్ గార్డ్ ఓ సాహసోపేతమైన చర్యను చేపట్టింది. పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌక, భారత మత్స్యకారుల బోటుపై దాడి చేసి ఏడుగురు మత్స్యకారులను బంధించడంతో, భారత కోస్ట్ గార్డ్ తక్షణమే స్పందించింది. దాదాపు రెండు గంటల పాటు ఆ నౌకను వెంబడించి, మత్స్యకారులను సురక్షితంగా విడిపించింది.

కోస్ట్ గార్డ్ వెల్లడించిన వివరాల ప్రకారం, నో ఫిషింగ్ జోన్ సమీపంలో మత్స్యకారుల బోటును పాక్ నౌక అడ్డగించింది. దాడి చేసి బోటును ముంచేసిన పాక్ అధికారులు, మత్స్యకారులను తమ నౌకలోకి ఎత్తుకున్నారు. ఈ పరిస్థితుల్లో భయాందోళనకు గురైన మత్స్యకారులు కోస్ట్ గార్డ్ ను సంప్రదించారు.

సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ అధికారి బృందం వెంటనే రెస్క్యూ మిషన్ ప్రారంభించింది. భారత్-పాక్ సముద్ర సరిహద్దుల వద్ద పాక్ నౌకను అడ్డుకుని, చాకచక్యంగా చర్యలు చేపట్టి భారత మత్స్యకారులను విడిపించింది. ఈ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన కోస్ట్ గార్డ్ బృందం ప్రశంసలు అందుకుంది.

ఈ ఘటన మరోసారి భారత కోస్ట్ గార్డ్ సామర్థ్యాన్ని చాటిచెప్పింది. మత్స్యకారులను సురక్షితంగా తీరం చేర్చడంతో, బాధిత కుటుంబాలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. సముద్ర మార్గంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు ఈ ఘటన కీలక మైలురాయిగా నిలుస్తుందని మత్స్యకార సంఘాలు పేర్కొన్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Tamil Nadu Chief Minister Vijay announcing anti-corruption reforms in government administration

CM Vijay | సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. అవినీతిపై సర్జికల్ స్ట్రైక్!

పారదర్శక, అవినీతి రహిత పాలన కోసం తమిళనాడు సీఎం విజయ్(CM Vijay) కీలక నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే భిన్నమైన విధానాలతో ముందుకు సాగుతున్న ఆయన, రాష్ట్ర అభివృద్ధితో...
- Advertisement -
Chat on WhatsApp