Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeCrime Newsపాక్ చెర నుంచి భారత మత్స్యకారులను కాపాడిన కోస్ట్ గార్డ్

పాక్ చెర నుంచి భారత మత్స్యకారులను కాపాడిన కోస్ట్ గార్డ్

-

Chat on WhatsApp

అరేబియా సముద్రంలో భారత కోస్ట్ గార్డ్ ఓ సాహసోపేతమైన చర్యను చేపట్టింది. పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌక, భారత మత్స్యకారుల బోటుపై దాడి చేసి ఏడుగురు మత్స్యకారులను బంధించడంతో, భారత కోస్ట్ గార్డ్ తక్షణమే స్పందించింది. దాదాపు రెండు గంటల పాటు ఆ నౌకను వెంబడించి, మత్స్యకారులను సురక్షితంగా విడిపించింది.

కోస్ట్ గార్డ్ వెల్లడించిన వివరాల ప్రకారం, నో ఫిషింగ్ జోన్ సమీపంలో మత్స్యకారుల బోటును పాక్ నౌక అడ్డగించింది. దాడి చేసి బోటును ముంచేసిన పాక్ అధికారులు, మత్స్యకారులను తమ నౌకలోకి ఎత్తుకున్నారు. ఈ పరిస్థితుల్లో భయాందోళనకు గురైన మత్స్యకారులు కోస్ట్ గార్డ్ ను సంప్రదించారు.

సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ అధికారి బృందం వెంటనే రెస్క్యూ మిషన్ ప్రారంభించింది. భారత్-పాక్ సముద్ర సరిహద్దుల వద్ద పాక్ నౌకను అడ్డుకుని, చాకచక్యంగా చర్యలు చేపట్టి భారత మత్స్యకారులను విడిపించింది. ఈ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన కోస్ట్ గార్డ్ బృందం ప్రశంసలు అందుకుంది.

ఈ ఘటన మరోసారి భారత కోస్ట్ గార్డ్ సామర్థ్యాన్ని చాటిచెప్పింది. మత్స్యకారులను సురక్షితంగా తీరం చేర్చడంతో, బాధిత కుటుంబాలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. సముద్ర మార్గంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు ఈ ఘటన కీలక మైలురాయిగా నిలుస్తుందని మత్స్యకార సంఘాలు పేర్కొన్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Crowd at Puri Jagannath Rath Yatra after a stampede incident in Odisha

Puri Jagannath Rath Yatra | జగన్నాథుడి రథయాత్రలో విషాదం.. 120 మందికి పైగా...

ఒడిశాలోని పూరీలో జరుగుతున్న శ్రీ జగన్నాథ రథయాత్ర(Puri Jagannath Rath Yatra) సందర్భంగా దుర్ఘటన చోటుచేసుకుని భక్తుల్లో విషాదాన్ని నింపింది. రథయాత్రను వీక్షించేందుకు భక్తులు పోటెత్తడంతో రద్దీ అదుపుతప్పి తొక్కిసలాట ఏర్పడింది. ఈ...
- Advertisement -
Chat on WhatsApp