Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeTelanganaMedakచిత్తు బొత్తు పైసల ఆటలపై దాడి చేసిన తూప్రాన్ సి.ఐ

చిత్తు బొత్తు పైసల ఆటలపై దాడి చేసిన తూప్రాన్ సి.ఐ

-

Chat on WhatsApp

మెదక్ జిల్లా తూప్రాన్ మండల పరిధిలో ని ధాతర్ పల్లి గ్రామ శివారులోని అడవిలో చిత్తు బొత్తు పైసల ఆటలు ఆడుతున్న స్థావరంపై తూప్రాన్ సి.ఐ రంగా క్రిష్ణ ఆధ్వర్యంలో ఆకస్మికంగా మెరుపు దాడులు నిర్వహించారు. వెల్దుర్తి, మనోహరాబాద్ ఎస్.ఐ లు మరియు కొంతమంది పోలీసు సిబ్బంది తో కలిసి సి.ఐ రంగా క్రిష్ణ చాకచక్యంగా సమాచారం మేరకు చిత్తు బొత్తు ఆడుతున్న స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడులలో 6 సెల్ ఫోన్లు, 6 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని విచారణ జరుపుతున్నారు. చిత్తుకు లక్ష బొత్తుకు లక్ష అంటూ చిత్తు-బొత్తు పైసల ఆట తూప్రాన్ మండల పరిధిలో గత కొంత కాలంగా లక్షల రూపాయలు పెట్టి ఆటలు ఆడుతూ గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతోంది. ఈ చిత్తు బొత్తు పైసల ఆట లో చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నా ఈ ఆటలపై ఇప్పటివరకు ఎలాంటి నిఘా లేకపోగా చర్యలు లేకపోవడంతో ఈ పైసల ఆట జోరుగా కొనసాగింది. ఈ సందర్భంగా సి.ఐ రంగా క్రిష్ణ మీడియా తో మాట్లాడుతూ.. ఇలాంటి ఆటల తో తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. ఇలాంటివి ప్రోత్సహించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp