Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeTelanganaJangaonగిరిజన యువకుడి మరణంపై కాంగ్రెస్ స్పందన

గిరిజన యువకుడి మరణంపై కాంగ్రెస్ స్పందన

-

Chat on WhatsApp

పాలకుర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, కాంగ్రెస్ పార్టీ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు లావుడియా భాస్కర్ నాయక్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వాహంచారు.ఈ సందర్భంగా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు, వీరమనేని యాకాంతరావు లు మాట్లాడుతూ.. నేడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన.. మహా ధర్నాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులపై మాట్లాడిన తీరు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. అధికారం కోల్పోయి మతిభ్రమించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. గిరిజన యువకుడు లకావత్ శ్రీను మరణానికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. శ్రీను కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp