Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeKeralaWayanad | కళ్లముందే విరిగిపడ్డ కొండచరియలు.. వైరల్ అవుతున్న సీసీటీవీ వీడియో

Wayanad | కళ్లముందే విరిగిపడ్డ కొండచరియలు.. వైరల్ అవుతున్న సీసీటీవీ వీడియో

-

Chat on WhatsApp

కేరళలోని వయనాడ్(Wayanad) జిల్లా మరోసారి ప్రకృతి విపత్తుతో వణికిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మంగళవారం కల్లాడి సమీపంలోని మీనాక్షి బ్రిడ్జి వద్ద, నిర్మాణంలో ఉన్న అనక్కంపోయిల్–కల్లాడి–మెప్పాడి టన్నెల్ రోడ్డు ప్రాజెక్టు ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. కొండపై నుంచి భారీ ఎత్తున మట్టి, రాళ్లు ఒక్కసారిగా కూలిపడటంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు అప్రమత్తంగా పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడగా, మరికొందరు మట్టిపెళ్లల కింద చిక్కుకున్నారు.

సీసీటీవీ వీడియోలో కొండచరియల వేగం స్పష్టంగా కనిపిస్తోంది. మట్టిప్రవాహం ధాటికి అక్కడ నిలిపి ఉంచిన ట్యాంకర్ లారీ కూడా కొంతదూరం వరకు కొట్టుకుపోయింది. మరోవైపు ఓ దంపతులతో పాటు మరో వ్యక్తి మట్టిలో చిక్కుకున్నప్పటికీ, కొద్దిసేపటి తర్వాత సురక్షితంగా బయటపడిన దృశ్యాలు ఊరట కలిగించాయి.

ఈ ఘటనతో పశ్చిమ కనుమల సున్నిత ప్రాంతాల్లో చేపడుతున్న భారీ నిర్మాణ పనులపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా టన్నెల్ రోడ్డు ప్రాజెక్టు పర్యావరణ ప్రభావంపై గతంలో వ్యక్తమైన ఆందోళనలు మళ్లీ చర్చకు వచ్చాయి. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సహాయక బృందాలు ఘటనాస్థలిలో సహాయ చర్యలను కొనసాగిస్తున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nothing Phone 4b

Nothing Phone 4b లాంచ్.. 6000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ప్రత్యేక డిజైన్‌తో గుర్తింపు పొందిన Nothing సంస్థ మరో కొత్త డివైస్‌ను పరిచయం చేసింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా 'B' సిరీస్‌లో భాగంగా Nothing Phone 4bను విడుదల...
- Advertisement -
Chat on WhatsApp