Tuesday, June 30, 2026
Chat on WhatsApp
HomeTelanganaNalgondaVijayawada-Hyderabad | కట్టంగూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం.. బస్సు, రెడీమిక్స్ లారీ ఢీ, ఇద్దరికి గాయాలు

Vijayawada-Hyderabad | కట్టంగూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం.. బస్సు, రెడీమిక్స్ లారీ ఢీ, ఇద్దరికి గాయాలు

-

Chat on WhatsApp

Vijayawada-Hyderabad: నల్గొండ జిల్లాలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కట్టంగూర్ మండలంలోని ముత్యాలమ్మగూడెం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రెడీమిక్స్ లారీ ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు లారీ డ్రైవర్ గాయపడగా, వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, భీమవరం నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో బయలుదేరిన ట్రావెల్స్ బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా టైరు పేలింది. దీంతో వాహనం డ్రైవర్ నియంత్రణ కోల్పోయి రోడ్డుకు ఎదురుగా వస్తున్న రెడీమిక్స్ లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన డ్రైవర్లను సమీప ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదం కారణంగా కొంతసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ప్రమాదానికి టైరు పేలడమే ప్రధాన కారణమా లేదా ఇతర సాంకేతిక లోపాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

india predicted playing xi for first t20i against england featuring vaibhav suryavanshi

India vs England T20 | సంజుకు మరో అవకాశం.. ఇంగ్లండ్ టీ20లో యువ...

India vs England T20: ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్న భారత జట్టు ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరిగే కీలక టీ20 సిరీస్‌పై పూర్తి దృష్టి సారించింది....
- Advertisement -
Chat on WhatsApp