Wednesday, July 22, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadమైత్రివనంలో భారీ అగ్ని ప్రమాదం.. మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది 

మైత్రివనంలో భారీ అగ్ని ప్రమాదం.. మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది 

-

Chat on WhatsApp

Maithrivanam- Ameerpet: అమీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా చెలరేగిన భారీ మంటలు అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. మైత్రివనం సమీపంలో ఉన్న కేఎస్‌ఆర్ ఫ్యాషన్స్ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి. భవనం నుంచి ఎగిసిపడిన మంటలు సమీపంలోని కొన్ని వ్యాపార సముదాయాలకు కూడా వ్యాపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది పలు అగ్నిమాపక వాహనాలతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు. అగ్ని తీవ్రత అధికంగా ఉండటంతో పోలీసులు కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాద ప్రాంతం వద్ద ప్రజలను దూరంగా ఉంచుతూ భద్రతా చర్యలను అమలు చేస్తున్నారు. మంటల కారణంగా ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా, స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా, ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగింది అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. అగ్ని ప్రమాదానికి గల అసలు కారణం కూడా తెలియాల్సి ఉంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp