Manchu Manoj: తెలుగు సినిమా లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావు సమాధి దుస్థితిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో నటుడు మంచు మనోజ్ స్వయంగా స్పందించారు. దాసరి వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్దకు వెళ్లిన మంచు మనోజ్, అక్కడి పరిసరాల్లో ఉన్న ముళ్ల పొదలు, చెట్లను తొలగించి శుభ్రం చేయించారు.
అనంతరం దాసరి నారాయణరావుకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా పాల్గొని దాసరి నారాయణరావుకు నివాళి అర్పించారు. సమాధి పరిసరాలను శుభ్రం చేయడం ద్వారా ఆయనకు గౌరవ నివాళి తెలిపారు.
దాసరి సమాధి పరిస్థితిపై సోషల్ మీడియాలో వచ్చిన స్పందనల తర్వాత మంచు మనోజ్ స్వయంగా అక్కడికి వెళ్లి చర్యలు తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.








