Friday, March 20, 2026
No menu items!
spot_img
HomeAndhra PradeshVijayawada Maoist Arrests: ఏకే-47 సహా భారీ ఆయుధాలు స్వాధీనం 

Vijayawada Maoist Arrests: ఏకే-47 సహా భారీ ఆయుధాలు స్వాధీనం 

-

విజయవాడలో మావోల అరెస్టుపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.పెనమలూరు ప్రాంతంలో కూలీల పేరుతో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని మావోలు షెల్టర్ జోన్‌గా మార్చుకున్నట్లు విచారణలో బయటపడింది. అక్కడ నుంచే పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు సూచనలు లభించాయి.

also read:సింగపూర్, టోక్యోతో పోటీ పడుతున్న హైదరాబాద్:సీఎం రేవంత్ రెడ్డి

ఆక్టోపస్ ప్రత్యేక బృందం ఈ రోజు నిర్వహించిన సమన్వయ ఆపరేషన్‌లో నగరంలోని పలు ప్రాంతాలు టార్గెట్ చేయగా, మొత్తం 31 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఆటోనగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన డంప్‌ నుండి ఏకే-47 రైఫిల్‌తో పాటు భారీగా డిటోనేటర్లు, గోలీలు, పేలుడు పదార్థాలు స్వాధీనం అయ్యాయి.

మావోయిస్టులు నగరంలో కార్యకలాపాలను విస్తరించే యత్నంలో ఉన్నారన్న అనుమానాల నేపథ్యంలో పోలీసులు మరిన్ని ప్రాంతాల్లో అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఈ ఆపరేషన్‌ను ఏపీ పోలీస్ విభాగం అత్యంత కీలకంగా పరిగణిస్తోంది.

- Advertisement -
- Advertisment -

Must Read

revanth reddy attending gaddar film awards event at hitex hyderabad

హైటెక్స్‌లో గద్దర్ అవార్డ్స్.. ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉగాది సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.