Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeOthersఅశుతోశ్ శర్మ వీర ఇన్నింగ్స్, డీసీ గెలుపు

అశుతోశ్ శర్మ వీర ఇన్నింగ్స్, డీసీ గెలుపు

-

Chat on WhatsApp

వైజాగ్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో అశుతోశ్ శర్మ ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. అతను కేవలం 31 బంతుల్లో 66 పరుగులు చేయడం విశేషం. చివరి మూడు ఓవర్లలో 11 బంతుల్లో 46 పరుగులు చేయడం ఢిల్లీ గెలుపులో కీలకంగా మారింది.

ఈ అద్భుత ప్రదర్శనకు గాను అశుతోశ్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డును తన మెంటార్ శిఖర్ ధావన్‌కు అంకితం చేస్తున్నాను అని మ్యాచ్ అనంతరం ప్రకటించాడు. అనంతరం డీసీ డ్రెస్సింగ్ రూమ్‌లో శిఖర్ ధావన్‌కు వీడియో కాల్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. ధావన్ కూడా అశుతోశ్‌ను అభినందిస్తూ ప్రత్యేకంగా ప్రశంసించాడు.

గత ఐపీఎల్‌ సీజన్‌లో అశుతోశ్, శిఖర్ ధావన్‌తో కలిసి పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. అశుతోశ్ ఫినిషర్‌గా పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈసారి మెగా వేలంలో డెల్హీ క్యాపిటల్స్ రూ.3.80 కోట్లకు అశుతోశ్‌ను కొనుగోలు చేసింది. ఈ విజయంతో ఢిల్లీ ప్లేఆఫ్ అవకాశాలను మెరుగుపర్చుకుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్, కోచ్ రికీ పాంటింగ్ అశుతోశ్ శర్మ ఇన్నింగ్స్‌ను విశేషంగా ప్రశంసించారు. అశుతోశ్ ప్రదర్శనపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపించారు. “ఈ యువ ఆటగాడి ఫినిషింగ్ స్కిల్స్ అద్భుతం” అంటూ క్రికెట్ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp