Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshమాదిగ అమరవీరులకు వెంకటగిరిలో క్యాండిల్ లైట్ నివాళి

మాదిగ అమరవీరులకు వెంకటగిరిలో క్యాండిల్ లైట్ నివాళి

-

Chat on WhatsApp

ఉమ్మడి తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని కాంపాలెం 25వ వార్డ్ మాదిగవాడలో మాదిగ అమరవీరులకు క్యాండిల్ లైట్ నివాళులు అర్పించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకత్వం నిర్వహించింది. ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధన కోసం పోరాటం చేస్తూ అసువులు బాసిన మాదిగ బిడ్డలకు జోహార్ అంటూ నాయకులు నివాళులర్పించారు.

ఎస్సీ వర్గీకరణ కోసం మూడునెల్ల కాలంగా నిరంతరం పోరాటం సాగిస్తున్నామని, పాలకుల మోసపూరిత విధానాలను తిప్పికొట్టే యుద్ధంలో అమరులైన మాదిగ బిడ్డల త్యాగాలను మరిచిపోకూడదని నాయకులు పేర్కొన్నారు. రాజ్యాంగ ప్రాతిపదికన, సుప్రీం కోర్టు తీర్పుతో మాదిగల హక్కు సాధించబడిందని, ఈ విజయాన్ని మాదిగ అమరవీరులకు అంకితం ఇచ్చిన సంగతిని గుర్తు చేసుకున్నారు.

తన ప్రాణాలను అర్పించిన అమరవీరుల స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిది అని ఎమ్మార్పీఎస్ నేతలు అన్నారు. మాదిగల హక్కుల సాధన కోసం ఎప్పుడూ ముందుంటామని, అణగారిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పల్లిపాటి రవి మాదిగ, ఎమ్మార్పీఎస్ వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జ్, టౌన్ అధ్యక్షుడు కంటి పల్లి మనీ తదితరులు నివాళులర్పించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nothing Phone 4b

Nothing Phone 4b లాంచ్.. 6000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ప్రత్యేక డిజైన్‌తో గుర్తింపు పొందిన Nothing సంస్థ మరో కొత్త డివైస్‌ను పరిచయం చేసింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా 'B' సిరీస్‌లో భాగంగా Nothing Phone 4bను విడుదల...
- Advertisement -
Chat on WhatsApp