Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshసంగంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు – అవగాహన క్యాంపు

సంగంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు – అవగాహన క్యాంపు

-

Chat on WhatsApp

సంగం మండలంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని సీఐ వేమా రెడ్డి, ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కొండ కూడలి వద్ద ప్రత్యేకంగా ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులకు రహదారి ప్రమాదాల నియంత్రణపై సూచనలు చేశారు. రహదారి భద్రతకు సంబంధించిన పలు సూచనలను అధికారుల సమక్షంలో వివరించారు.

రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు అంటించారు. రహదారిపై ట్రాక్టర్లు మితిమీరిన వేగంతో నడిపే ప్రమాదాలను అధికారులు వివరించారు. ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని అధికారుల సూచించారు.

ఈ కార్యక్రమంలో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పోలీసులు వారికి ప్రమాదాల తీవ్రతను తెలియజేస్తూ, రాత్రి వేళల్లో ట్రాక్టర్లను జాగ్రత్తగా నడపాలని సూచించారు. అలాగే, రహదారిపై అప్రయత్నంగా రోడ్డుపై వాహనాలు నిలిపి పెట్టరాదని హెచ్చరించారు.

కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొని, భద్రతకు సంబంధించిన కీలకమైన సూచనలను అందించారు. భవిష్యత్తులో ఇటువంటి అవగాహన కార్యక్రమాలను ఇంకా విస్తృతంగా చేపడతామని సీఐ వేమా రెడ్డి తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

instagram ai image feature removed after privacy concerns

మెటా కీలక నిర్ణయం.. Meta AI Image ఫీచర్‌కు బ్రేక్

Meta AI Image: కృత్రిమ మేధ (AI) ఆధారిత ఫీచర్లను వేగంగా విస్తరిస్తున్న మెటా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రవేశపెట్టిన ఒక కొత్త సౌకర్యాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంది. వినియోగదారుల ఫొటోలను AI...
- Advertisement -
Chat on WhatsApp