కొల్చారం మండలంలో విషాదకర విద్యుత్ ప్రమాదం జరిగింది. కిష్టాపూర్ శివారులో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసుకెళ్లే సమయంలో విద్యుత్ తీగ తగిలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
స్థానికుల కథనం ప్రకారం, అక్కెంనవీన్, పసువవుల ప్రసాద్ అనే వ్యక్తులు ఈ ప్రమాదానికి గురయ్యారు. వారు ఫ్లెక్సీలు తీసుకెళ్లే ప్రయత్నంలో విద్యుత్ తీగలకు తాకడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. దీనిపై పూర్తి వివరాలను వెలుగులోకి తెచ్చేందుకు విచారణ చేపట్టారు.
ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.