Thursday, April 9, 2026
Chat on WhatsApp
HomeTelanganaMedakసంగాయిపేట చెరువుల కాలుష్యంపై మత్స్యకారుల ఆందోళ

సంగాయిపేట చెరువుల కాలుష్యంపై మత్స్యకారుల ఆందోళ

-

Chat on WhatsApp

మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని సంగాయిపేట గ్రామంలో చెరువులు కలుషితం అవుతున్నాయని మత్స సహకార సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు.

గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రతిరోజు చెత్తను డంపు యార్డ్ కు తరలించకుండా చెరువు పరిసరాల్లో వేయడం వల్ల నీరు కలుషితమై చేప పిల్లలు మృతి చెందుతున్నాయని వారు తెలిపారు.

చెరువుల పక్కన చెత్త వేయడం వల్ల చేపల జీవన పరిస్థితులు దెబ్బతింటున్నాయని మత్సకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో డంపు యార్డ్ ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల సమస్య మరింత తీవ్రమైందని ఆరోపిస్తున్నారు.

చెరువు నీటి కాలుష్యంతో గ్రామస్తుల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

అధికారులను వెంటనే ఈ సమస్యపై స్పందించి, చెత్తను చెరువు వద్ద కాకుండా డంపు యార్డ్ కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని మత్సకారులు విజ్ఞప్తి చేశారు.

స్థానిక మత్స్యకార సంఘం ప్రతినిధులు చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కాలుష్యాన్ని నివారించేందుకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకుని గ్రామ ప్రజలకు మంచినీటి సరఫరా మెరుగుపర్చాలని వారు కోరుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Sensex and Nifty fall after five-day rally amid global tensions and rising crude oil prices

Sensex and Nifty | మిడిల్ ఈస్ట్ టెన్షన్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌ లాభాలకు...

Sensex and Nifty: భారతీయ ఈక్విటీ మార్కెట్లకు వరుసగా ఐదు రోజులుగా కొనసాగిన లాభాల ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. అంతకుముందు అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ సంకేతాలతో మార్కెట్లు భారీగా పుంజుకున్నప్పటికీ,...
- Advertisement -
Chat on WhatsApp