Sunday, March 29, 2026
Chat on WhatsApp
HomeInterNationalపాక్ హాకీ ప్లేయర్లకు షాక్.... కాంస్యానికి 100 డాలర్ల బహుమతి!

పాక్ హాకీ ప్లేయర్లకు షాక్…. కాంస్యానికి 100 డాలర్ల బహుమతి!

-

Chat on WhatsApp

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో మూడో స్థానంలో నిలిచిన పాకిస్థాన్ హాకీ జట్టు కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది, అయితే వారి నగదు బహుమతి వివాదాస్పదమైంది.

పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్ఎఫ్) ఆటగాళ్లకు ఒక్కొక్కరికి 100 డాలర్ల (రూ. 8,366) బహుమతి ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు నిర్ఘాంతపోయారు.

పీహెచ్ఎఫ్ అధ్యక్షుడు మీర్ తారిక్ బుగ్తీ ఈ బహుమతిని ధృవీకరిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేశారు. జట్టు ప్రదర్శనకు ప్రోత్సాహం ఇవ్వడానికే ఈ నగదు పురస్కారం అని అన్నారు.

అయితే, ఈ మొత్తంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా తక్కువ మొత్తాన్ని ఇవ్వడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నగదు బహుమతిని అసలు ఇవ్వకపోతే బాగుండేది అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అంత మంచి ప్రదర్శన చేసిన జట్టుకు ఇలా తక్కువ ఇవ్వడం అన్యాయం అంటున్నారు.

చైనాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాక్ కంగుతింది. పెనాల్టీ షూటౌట్‌లో ఘోర పరాజయం పాలైంది.

ఆ తర్వాత కాంస్య పతక పోరులో కొరియాను 5-2తో ఓడించి టోర్నమెంట్‌లో మూడో స్థానాన్ని సాధించింది.

మరోవైపు, ఫైనల్లో చైనాను ఓడించి భారత జట్టు రికార్డు స్థాయిలో ఐదోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

telangana cm revanth reddy launching tholi mudda breakfast scheme for anganwadi children in assembly premises

Anganwadi Breakfast Scheme | సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త పథకం.....

Anganwadi Breakfast Scheme: తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారాన్ని మెరుగుపరచే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ‘తొలి ముద్ద’(Tholi Mudda) పేరుతో ప్రత్యేక...
- Advertisement -
Chat on WhatsApp