కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ఉప్పల్ వాయి గ్రామస్తులు కొత్త బస్టాండ్ ముందు ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నా ద్వారా గ్రామానికి బస్సు సేవలు అందించాలంటూ వారు తీవ్రంగా డిమాండ్ చేశారు.
గ్రామస్తులు ప్రసన్న, దాసరి పోషవ్వ, పల్లె. సుగుణ, కోరాడి లక్ష్మి, ఆస్మా మాట్లాడుతూ, తమ గ్రామానికి బస్సు రాకపోవడం బాధాకరమని చెప్పారు.
గత పది నెలలుగా గ్రామానికి బస్సు రాకపోవడం వలన మహిళలు అధార్ కార్డు ఉన్నా కూడా ప్రయాణం చేయలేకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పండగల సమయంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని, గ్రామ ప్రజలు తీవ్రంగా అలసిపోయారని గ్రామస్తులు తెలిపారు.
ఉప్పల్ వాయి గ్రామానికి చెందిన ప్రజలు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ రావు గారికి కామారెడ్డి డిపో మేనేజర్ తో మాట్లాడి, రేపటినుండి బస్సు సేవలను పునరుద్ధరించాలంటూ అభ్యర్థించారు.
ఈ ధర్నా కార్యక్రమంలో గంగాధర్, విక్కి, రాము, అనసూయ, సాయవ్వ, పద్మ, పుతిలిబి, అన్వర్, షబానా మరియు ఇతర గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గ్రామ ప్రజలు తమ సమస్యకు పరిష్కారం కావాలని, బస్సు సేవలను వెంటనే పునరుద్ధరించాలని అధికారులను కోరారు.