ప్రజాకవి పద్మవిభూషన్ కాళోజీ 110వ జయంతిని పురస్కరించుకుని కాళోజీ నారాయణరావు చిత్రాన్ని ఆవాలను ఉపయోగించి అత్యద్భుతంగా చిత్రించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కి చెందిన రామకోటి రామరాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రజల మనిషి తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆకాంక్షలను రగిలించిన ప్రజాకవి కాళోజీ అని,అక్షర రూపం దాల్చిన ఓ సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక అంటూ చైతన్యాన్ని చక్కగా చెప్పిన ప్రజాకవి కాళోజీ అని అన్నారు.
పుట్టుక నీది, చావు నీది బ్రతుకంతా దేశానిది అన్న కాళోజీ మాటలు మర్చిపోలేనివి అని, తెలుగు భాషా దినోత్సవ మూల కారకులు కాళోజి అని అన్నారు.
ఆవాలతో కాళోజీ చిత్ర ఆవిష్కరణ: గజ్వేల్ వాసి ఘన నివాళి
