అమీన్ పూర్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణ తొలగింపు

అమీన్ పూర్ మండలంలో 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణను హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంది. నిర్మాణాలు కూల్చి, సరిహద్దు రాళ్లను తొలగించారు. స్కూల్ యాజమాన్యం ఆక్రమించిన 15 గుంటలు కూడా కూల్చివేశారు. అమీన్ పూర్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణ తొలగింపు

సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ మండలంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలం 20 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణలను తొలగించాలంటూ రెవెన్యూ అధికారులను ఆదేశించింది. దీంతో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన నిర్మించిన కట్టడాలను కూల్చేస్తూ, సరిహద్దు రాళ్లను రెవెన్యూ సిబ్బంది తొలగించారు. స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన అధికారులు.. సర్వే నంబర్‌ 119లో గుర్తుతెలియని వ్యక్తులు వేసిన ప్లాట్లను తొలగించారు. ఈ భూమిలో ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం 15 గుంటలు ఆక్రమించినట్లు గుర్తించారు. స్కూల్ ప్రహరీతో పాటు ఆక్రమించిన భూమిలో నిర్మించిన పలు గదులను కూలగొట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *