Friday, March 20, 2026
No menu items!
spot_img
HomeNationalZomato | ఫుడ్ డెలివరీ వినియోగదారులకు షాక్.. జొమాటో ఫీజు పెంపు

Zomato | ఫుడ్ డెలివరీ వినియోగదారులకు షాక్.. జొమాటో ఫీజు పెంపు

-

zomato: ఫుడ్ డెలివరీ రంగంలో ప్రముఖ సంస్థ జొమాటో తన ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచుతూ వినియోగదారులకు మరోసారి అదనపు భారం మోపింది. కంపెనీ యాప్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఇకపై ప్రతి ఆర్డర్‌పై వినియోగదారులు అదనంగా రూ.2.40 చెల్లించాల్సి ఉంటుంది.

దీంతో ఇప్పటివరకు రూ.12.50గా ఉన్న ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.14.90కి పెరిగింది. ఈ పెంపు వల్ల చిన్న మొత్తాల ఆర్డర్లపైనా కస్టమర్లకు చెల్లించాల్సిన మొత్తం పెరగనుంది. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ మార్కెట్లో జొమాటోకు ప్రధాన పోటీదారుగా ఉన్న స్విగ్గీ కూడా అన్ని పన్నులు కలిపి సుమారు రూ.14.99 ప్లాట్‌ఫామ్ ఫీజు వసూలు చేస్తోంది.

దీంతో రెండు ప్రముఖ కంపెనీలు దాదాపు ఒకే తరహా ఛార్జీల విధానాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ ఫీజు పెంపుకు పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు కారణంగా కనిపిస్తున్నాయి. ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన వ్యయాలు అధికమవుతున్నాయి. దాంతో డెలివరీ కార్యకలాపాల నిర్వహణ ఖర్చు కూడా పెరుగుతోంది.

లాజిస్టిక్స్, ట్రాన్స్‌పోర్ట్, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ల ఆపరేషనల్ వ్యయాల పెరుగుదల జొమాటో వంటి సంస్థలపై ఒత్తిడి తెస్తోంది. అందుకే ప్లాట్‌ఫామ్ ఫీజు రూపంలో ఆ భారం కొంతమేర వినియోగదారులపై మళ్లిస్తున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే సాధారణ వినియోగదారుల దృష్టిలో ఈ పెంపు ప్రతి ఆర్డర్ ఖర్చును మరింత పెంచే అంశంగా మారింది.

ఇదిలా ఉండగా, ఫుడ్ డెలివరీ మార్కెట్లో పోటీ మాత్రం తగ్గడం లేదు. ప్రముఖ క్యాబ్ బుకింగ్ సంస్థ ర్యాపిడో ‘ఓన్లీ’ పేరిట బెంగళూరులో ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించింది.

డెలివరీ ఫీజు తప్ప వినియోగదారులు, రెస్టారెంట్లపై అదనపు రుసుములు ఉండవని ప్రకటించడం మార్కెట్లో చర్చనీయాంశమైంది. ఈ కొత్త బిజినెస్ మోడల్ జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలపై మరింత ఒత్తిడి పెంచే అవకాశం ఉంది.

మొత్తానికి జొమాటో ఫీజు పెంపు ఒకవైపు వినియోగదారుల ఖర్చును పెంచుతుండగా, మరోవైపు మార్కెట్లో పోటీని మరింత ఆసక్తికరంగా మార్చుతోంది.

- Advertisement -
- Advertisment -

Must Read

cloudy sky over andhra pradesh with chances of rain and gusty winds in next 24 hours

Rain Alert | రానున్న 24 గంటల్లో ఏపీలో వర్షాలు..హెచ్చరిక జారీ చేసిన వాతావరణ...

Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న 24 గంటల్లో వాతావరణం మారే అవకాశముందని వాతావరణ శాఖ సూచిస్తోంది. పశ్చిమ బంగాళాఖాతం సమీప ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు...