Vijayawada-Hyderabad: సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరుగు ప్రయాణం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ వాహనాల రద్దీ నెలకొంది. ముఖ్యంగా చిట్యాల, పెద్దకాపర్తి, చౌటుప్పల్ ప్రాంతాల్లో వాహనాలు బారులుగా నిలిచాయి.
ALSO READ:United Airlines | ల్యాండింగ్ సమయంలో ఊడిన టైర్…తప్పిన ప్రమాదం
ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ జామ్ పరిస్థితి ఏర్పడింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాల కదలిక నెమ్మదిగా సాగుతోంది. దీంతో ప్రయాణికులు ఆలస్యానికి గురవుతున్నారు.
ట్రాఫిక్ను నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రద్దీ నేపథ్యంలో ప్రయాణికులు సహనం పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.
