Monday, April 6, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshALLURI SITHARAMA RAJUఅడ్డతీగల మండలంలో గుర్తుతెలియని మృతదేహం కలకలం

అడ్డతీగల మండలంలో గుర్తుతెలియని మృతదేహం కలకలం

-

Chat on WhatsApp

అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని అడ్డతీగల మండలం పైడి పుట్ట కాలువ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ఉదయం అక్కడికి వెళ్లిన గ్రామస్తులు మృతదేహాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం ఎంతకాలంగా అక్కడ ఉందో స్పష్టత రాలేదు. ప్రాథమికంగా దుస్తుల ఆధారంగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలను తెలుసుకునేందుకు సమీప గ్రామాల్లో అదృశ్యమైన వ్యక్తుల సమాచారం కోసం విచారణ చేస్తున్నారు. అదనపు ఆధారాలు కోసం కాలువ పరిసరాలను పరిశీలిస్తున్నారు.

ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయాడా? లేక ఇది హత్యా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

diplomatic efforts intensify as usa and iran consider a temporary ceasefire plan

Usa-Iran | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు చెక్?…అమెరికా-ఇరాన్ మధ్య కొత్త పరిణామం

Usa-Iran: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ఉపశమనం కలిగించే దిశగా అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణపై చర్చలు ముందుకు సాగుతున్నట్టు అంతర్జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో మధ్యవర్తి దేశాలు సిద్ధం...
- Advertisement -
Chat on WhatsApp