అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా చేసిన శ్రీ అంబటి లక్ష్మణ రావు గారు ది 16 అక్టోబర్ నాడు కీర్తి శేషులైన సందర్భముగా వారి సంస్మరణ సభ 27 అక్టోబర్ 2024 నాడు జల విహార్ లో జరిగింది.
ఈ సందర్భముగా యూనియన్ బ్యాంక్ ఆఫీసర్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శ్రీ ఎం ఎం భాస్కర రావు గారు మాట్లాడారు.లక్ష్మణ రావు గారి ఉన్నతమైన వ్యక్తిత్వము కలవారని చెప్తూ ఆయన తో తనకున్న చిరకాల అనుభందము గురించి చెప్పారు. వారు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి న్యాయవాది గా, జడ్జి గా చాలకాలం పని చేశారు.
ఇంకా ఈ సంస్కరణ సభ కు శ్రీయుతులు జయప్రకాష్ నారాయణ, జే ది లక్ష్మీనారాయణ, జస్టిస్ భవాని ప్రసాద్, నిమ్మగడ్డ రమేష్, హైడ్ర కమిషనర్ రంగనాథ్ ఇంకా అనేకమంది లక్ష్మణ రావు గారి ఉన్నతమైన వ్యక్తిత్వము గురించి గొప్పగా చెప్పారు. వారి బయోగ్రఫీ పుస్తకము అనతి కాలంలో పబ్లిష్ చేయటానికి కృషి జరుగుతుందని చెప్పారు.








