విజయవాడ ఉత్సవ్కు జాతీయ గుర్తింపు, అక్టోబర్ 2న మెగా కార్నివాల్
విజయవాడలో జరుగుతున్న ఉత్సవాలు ఈసారి మరింత విస్తృతంగా, అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయి. భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన మైసూరు దసరా, కోల్కతా దుర్గాపూజా వంటి ఉత్సవాలకంటే విజయవాడ ఉత్సవ్ మరింత ప్రజాధారణ పొందిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గర్వంగా ప్రకటించారు. సోమవారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో కలిసి ఆయన పున్నమి ఘాట్ వద్ద జరుగుతున్న వేడుకలను సందర్శించారు. ఈ సందర్బంగా రామ్మోహన్ మాట్లాడుతూ, “ఈ ఉత్సవం మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ,…
