Samajwadi Party leader: ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఓ కారుపై అకస్మాత్తుగా హై-మాస్ట్ బిల్బోర్డ్ స్తంభం కూలిపోవడంతో కారును నడుపుతున్న సమాజ్వాదీ పార్టీ నేత అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటన ప్రతాప్గఢ్ జిల్లాలోని బాబుగంజ్ మార్కెట్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది.
పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద కొత్తగా హై-మాస్ట్ బిల్బోర్డ్ ఏర్పాటు పనులు కొనసాగుతున్న సమయంలో, అదే రహదారిపై వెళ్తున్న కారుపై నిర్మాణంలో ఉన్న స్తంభం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 48 ఏళ్ల ఎస్పీ నేత లాల్ బహదూర్ యాదవ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఇతర శాఖల అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ దుర్ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
