Friday, February 20, 2026
spot_img
HomeTelanganaHyderabadశబరిమల ప్రధాన అర్చకుడు మురళీ నంబూతిరి పదవీ విరమణ

శబరిమల ప్రధాన అర్చకుడు మురళీ నంబూతిరి పదవీ విరమణ

శబరిమల అయ్యప్ప ఆలయ ప్రధాన అర్చకుడు పీజీ మురళీ నంబూతిరి తన పదవీ విరమణను ప్రకటించారు. గత సంవత్సరం ప్రధాన అర్చకుడిగా నియమితులైన మురళీ స్వామి, కార్తీక మాసంతో తన పదవీకాలాన్ని ముగించారు. హైదరాబాద్‌కు చెందిన మురళీ స్వామి ప్రస్తుతం మలికప్పురం ఆలయ అర్చకుడిగా కొనసాగుతున్నారు. తన పదవీ విరమణ సందర్భంగా మురళీ స్వామి మాట్లాడుతూ, శబరిమల అయ్యప్ప ఆలయంలో సేవలందించటం తనకు ధన్యతగా భావిస్తున్నానని అన్నారు. తెలుగు వాడిగా ఆ ఆలయంలో సేవలందించే అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. తమ సేవకాలంలో అయ్యప్ప భక్తుల అచంచలమైన ఆధ్యాత్మిక విశ్వాసాన్ని చూడడం ప్రత్యేకమైన అనుభవమని పేర్కొన్నారు. మురళీ స్వామి సేవలను శబరిమల ఆలయ అధికారులు, భక్తులు ప్రశంసించారు. ఆయన ఆశీర్వచనాలు భక్తుల హృదయాల్లో నిలిచిపోయాయి. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తుల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular