Thursday, March 19, 2026
No menu items!
spot_img
HomeBusinessOla Electric | ఓలా ఎలక్ట్రిక్ ₹2,000 కోట్ల వాటా విక్రయానికి సిద్దం

Ola Electric | ఓలా ఎలక్ట్రిక్ ₹2,000 కోట్ల వాటా విక్రయానికి సిద్దం

-

Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ కీలక ఆర్థిక నిర్ణయం తీసుకుంది. తన బ్యాటరీ విభాగం “ఓలా సెల్ టెక్నాలజీస్ (OCT)”(Ola Cell Technologies) లో వాటాను విక్రయించి సుమారు ₹2,000 కోట్ల వరకు నిధులు సమీకరించనుంది. ఈ నిర్ణయం కంపెనీ ఆర్థిక స్థితిని బలపరుస్తూ, బ్యాటరీ వ్యాపారానికి మార్కెట్ విలువను నిర్ణయించడంలో సహాయపడుతుంది. అవెండస్ క్యాపిటల్ మరియు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ను వాటా విక్రయాన్ని నిర్వహించడానికి నియమించారు.

OCT ప్రస్తుతం తమిళనాడులో 1.5 GWh సామర్థ్యంతో లిథియం-ఐయాన్ సెల్ ప్లాంట్‌ను నడిపిస్తోంది. ఇది ఆర్థిక సంవత్సరానికి చివరి వరకు 6 GWhకి పెరగనుంది. స్థానికంగా బ్యాటరీ తయారీని ప్రోత్సహించి, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యం. ₹3,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన గిగాఫ్యాక్టరీ ఎలక్ట్రిక్ వాహనాలకే కాక, పరిశ్రమల ఎనర్జీ స్టోరేజ్ అవసరాలకు కూడా మద్దతు ఇస్తుంది.

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే గృహ వినియోగానికి బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ పరిచయం చేసింది, త్వరలో వాణిజ్య రంగానికి విస్తరిస్తుంది. బ్యాటరీ ఇన్నోవేషన్ సెంటర్లో 200 పైగా ఇంజనీర్లు, పరిశోధకులు పని చేస్తున్నారు. NMC, LFP, LMFP, LMR టెక్నాలజీలలో 400కి పైగా పేటెంట్లు అభివృద్ధి చేయబడ్డాయి. ఈ వాటా విక్రయం ఆర్థిక పునర్వ్యవస్థీకరణలో భాగంగా, విస్తరణకు నిధులు సమీకరించడమే ప్రధాన ఉద్దేశ్యం.

- Advertisement -
- Advertisment -

Must Read

oil and gas storage tanks representing india energy security monitoring system

India energy security | ఇంధన భద్రతపై కేంద్రం అలర్ట్‌.. ఆయిల్ కంపెనీలకు కీలక...

India energy security: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరా అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో చమురు మరియు సహజ వాయువు సంస్థలకు కీలక...