పరిశ్రమల కోసం భూములు కోల్పోతున్న రైతులకు తగిన పరిహారం ఇవ్వాలి:MLA Chinta Prabhakar

Farmers meeting MLA Chinta Prabhakar in Sangareddy over TGIIC land acquisition Farmers meeting MLA Chinta Prabhakar in Sangareddy over TGIIC land acquisition

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మునిదేవునిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 92లో TGIIC ద్వారా పరిశ్రమ ఏర్పాటు కారణంగా భూములు కోల్పోతున్న రైతులకు తగిన పరిహారం ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన్ని కలిసి వినతి పత్రం అందజేశారు.

పరిశ్రమల లో కోల్పోతున్న భూముల మీదనే తమ కుటుంబాలు పూర్తిగా ఆధారపడి ఉన్నాయని, భూములు తీసుకుంటే అనేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు పేర్కొన్నారు. పరిశ్రమల కోసం భూములు స్వాధీనం చేసుకునే ముందు భూ బాధితులకు తగిన పరిహారం ఎంత ఇవ్వబోతున్నారో స్పష్టత ఇవ్వాలని వారు కోరారు.

ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం, అదేవిధంగా ఒక ప్లాట్ కేటాయించాలని, సాగులో ఉన్న భూములకు సరైన మరియు న్యాయమైన పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే వెంటనే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

ALSO READ:Tejas fighter jet crashes | దుబాయ్‌లో కుప్పకూలిన తేజస్ ఫైటర్ జెట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *