Sunday, April 12, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshANANTAPURఅనంతపురం బస్సు డిపోలో భారీ అగ్నిప్రమాదం

అనంతపురం బస్సు డిపోలో భారీ అగ్నిప్రమాదం

-

Chat on WhatsApp

అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జెసి దివాకర్ రెడ్డి ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు పార్కింగ్ డిపోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 11కేవి హెవీ లైన్ విద్యుత్ వైరు తెగిపడటంతో అక్కడ ఉన్న బస్సులపై మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో పలు వాహనాలు దగ్దమయ్యాయి.

మంటలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో దట్టమైన పొగలు చుట్టుపక్కల వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు అదుపు చేసేందుకు వారంతా తీవ్రంగా శ్రమించారు.

ఈ ప్రమాదంలో ఒక బస్సు పూర్తిగా కాలిపోగా, మరొక బస్సు పాక్షికంగా దెబ్బతింది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇది అందరికీ ఊరటను కలిగించింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఇతర బస్సులను తక్షణమే దూరం చేయడం వల్ల పెద్ద నష్టం తప్పింది.

మంటలు అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది, పలు బస్సులను రక్షించగలిగారు. ప్రమాదానికి కారణమైన విద్యుత్ వైర్లు పరిశీలనకు తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరమని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi addressing a public rally in West Bengal during election campaign

PM Modi | ఆడబిడ్డల భద్రత పై మోడీ ధ్వజం .. ఎన్నికల ప్రసంగంలో...

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్,...
- Advertisement -
Chat on WhatsApp