IPL 2026: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్లలో ఒకటైన Indian Premier League (ఐపీఎల్) 2026 సీజన్కు ముందు జట్ల యజమాన్యాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా Royal Challengers Bangalore (ఆర్సీబీ), Rajasthan Royals (ఆర్ఆర్) ఫ్రాంచైజీలు భారీ డీల్స్తో కొత్త యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లాయి.
ఆర్సీబీని ఆదిత్య బిర్లా గ్రూప్తో పాటు ఇతర పెట్టుబడిదారులు రూ.16,706 కోట్లకు కొనుగోలు చేయగా, రాజస్థాన్ రాయల్స్ను కల్ సోమని నేతృత్వంలోని కన్సార్షియం రూ.15,300 కోట్లకు సొంతం చేసుకుంది.
మిగతా జట్ల యజమాన్యాలు కూడా బలమైన కార్పొరేట్, సినీ ప్రముఖుల చేతుల్లోనే ఉన్నాయి. Mumbai Indians జట్టును రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) ఆధ్వర్యంలో నీతా అంబానీ నిర్వహిస్తున్నారు.
Kolkata Knight Riders జట్టుకు Shah Rukh Khan, జూహీ చావ్లా భాగస్వామ్యం ఉంది. Sunrisers Hyderabad జట్టును సన్ టీవీ నెట్వర్క్ యజమాని కలానిథి మారన్ నడిపిస్తున్నారు.
అలాగే Punjab Kings జట్టులో ప్రీతి జింటా, వాడియా గ్రూప్, మోహిత్ బర్మన్ భాగస్వాములు. Delhi Capitals జట్టును జేఎస్డబ్ల్యూ గ్రూప్ నిర్వహిస్తుండగా, Lucknow Super Giants యజమాని సంజీవ్ గోయెంకా. Chennai Super Kings జట్టు ఇండియా సిమెంట్స్కు చెందినది. Gujarat Titans జట్టును సీవిసీ క్యాపిటల్ పార్ట్నర్స్ నిర్వహిస్తోంది.
ఇలా కార్పొరేట్ దిగ్గజాలు, సినీ ప్రముఖులు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల మద్దతుతో ఐపీఎల్ మరింత గ్లోబల్ స్థాయికి ఎదుగుతోంది. ఈ బలమైన యాజమాన్య నిర్మాణమే లీగ్ విజయానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.







