India-US Trade Deal: భారత–అమెరికా మధ్య కీలక మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు అయ్యింది. ఈ ఒప్పందం ద్వారా భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన 50% సుంకాలను 18%కి తగ్గించనున్నట్లు ప్రకటించారు. దీనితో భారత వ్యాపార వర్గాలు ఊరట పొందాయి.
భవిష్యత్తులో భారత్ అమెరికా నుండి ఇంధనం, గ్యాస్, ఎనర్జీ, టెక్నాలజీ ఉత్పత్తులు, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తులను భారీగా దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. అదే సమయంలో, అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకాల(US tariffs on Indian products)ను సున్నా శాతానికి తగ్గిస్తూ, పండ్లు, కూరగాయలు, వైన్ వంటి ఉత్పత్తులపై పూర్ణ రద్దు కూడా చేయనుంది.
ఈ ఒప్పందం విజయవంతమైతే, రెండు దేశాల మధ్య సుంకాలను పూర్తిగా తొలగించే దిశగా చర్యలు తీసుకుంటారు. అదనంగా, అమెరికా జెనరిక్ మందులు, విమాన భాగాలు, రత్నాలు, వజ్రాలపై ఉన్న సుంకాలను కూడా రద్దు చేయనుంది. కేంద్ర ప్రధాని మోడీ నేతృత్వంలో ఈ ఒప్పందం భారత–అమెరికా వ్యాపార సంబంధాలను మరింత బలపరుస్తుంది.
also read:భారతీయ మార్కెట్లో Brave Ark 2-in-1 Android డివైస్ లాంచ్
