బతుకమ్మ వేడుకలు కామారెడ్డిలో వైభవంగా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు , SRK , RK , PJR , స్ఫూర్తి ఒకేషనల్ , కాలేజీలలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంకు కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు.

బతుకమ్మ కార్యక్రమంలో కాలేజ్ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడుతు మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందు ప్రియ సందడి చేశారు.

ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ: తెలంగాణలో ప్రతి ఇంట్లో బతుకమ్మ సంబరాలు చేసుకుంటారన్నారు.

బొడ్డెమ్మతో మొదలుకొని ఎంగిలిపుప్వు బతుకమ్మ , సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే ఉందన్నారు.

తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా రంగు రంగుల పూలతో ప్రతి అడపడుచు ముందుంటున్నారు.

వెయ్యి ఏళ్లుగా బతుకమ్మను ఇక్కడి ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో, వార్డ్ కౌన్సిలర్ , వనిత రామ్మోహన్ , పడిగే. సుగుణ , బాలరాజ్ , కాలేజ్ ప్రిన్సిపాల్ M. జైపాల్ రెడ్డి , చైర్మన్ గురు రాఘవేందర్ రెడ్డి,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *