Saturday, February 21, 2026
spot_img
HomeTelanganaAdilabadగ్యాస్ సిలిండర్ల దొంగల ముఠా అరెస్ట్

గ్యాస్ సిలిండర్ల దొంగల ముఠా అరెస్ట్

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ పోలీసులు అంతర్రాష్ట్ర గ్యాస్ సిలిండర్ల దొంగల ముఠాను పట్టుకున్నట్లు డిఎస్పి జీవన్ రెడ్డి తెలిపారు. జైనథ్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

పోలీసుల సాధారణ తనిఖీ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, దానిలో 74 గ్యాస్ సిలిండర్లు లభ్యమయ్యాయని చెప్పారు. రాజస్థాన్‌కు చెందిన హర్ష అనే వ్యక్తి ఆలపల్లి గ్యాస్ ఏజెన్సీకి పనిచేస్తూ ఈ దొంగతనానికి పాల్పడినట్లు పేర్కొన్నారు.

దీపావళి పండుగకు స్వగ్రామం వెళ్ళిన హర్ష, తిరుగు ప్రయాణంలో బిస్వాయి అనే వ్యక్తితో కలిసి జైనథ్‌లోని HP గ్యాస్ గోదాంలో తాళాలు పగులగొట్టి సిలిండర్లను దొంగిలించాడు. పోలీసులు సిలిండర్ల విలువ సుమారు రూ.10,000 అని అంచనా వేశారు.

నిందితులపై కేసులు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జైనథ్ సీఐ సాయినాథ్, ఎస్సై పురుషోత్తం కూడా పాల్గొన్నారు. పోలీసులు గ్యాస్ సిలిండర్ల చోరీ ఘటనకు త్వరితగతిన స్పందించి ముఠాను అరెస్ట్ చేయడం ప్రశంసనీయమని అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular