సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని ప్రభుత్వ దావాఖానా వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ మంగళవారం 100వ రోజుకు చేరుకుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని ప్రతిరోజు ప్రభుత్వ దావాఖానాలో రోగులకు వారి బంధువులకు ఉచిత అల్పాహారం అందజేయడం హర్షించదగ్గ విషయమని లయన్స్ క్లబ్ సేవకు ప్రతిరూపమని లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ ను అభినందిస్తూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవలను మరింత విస్తృతం చేయాలని లయన్స్ క్లబ్ సభ్యులకు సూచించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్, గోలి సంతోష్, నేతి శ్రీనివాస్, గుడాల రాధాకృష్ణ, సంజయ్ గుప్తా, మల్లేశం గౌడ్,పరమేశ్వర చారి, రావి కంటి చంద్రశేఖర్, టీచర్ సత్యనారాయణ, డాక్టర్ నర్సింలు،కుమారస్వామి, దొంతుల, సత్యనారాయణ, అజయ్, తదితరులు పాల్గొన్నారు
గజ్వేలులో 100వ రోజు ఉచిత అల్పాహార కార్యక్రమం
