Friday, February 20, 2026
spot_img
HomeCrime Newsతాడిపర్రులో కరెంట్ షాక్, నలుగురు మృతి

తాడిపర్రులో కరెంట్ షాక్, నలుగురు మృతి

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని తాడిపర్రులో ఫ్లెక్సీ కడుతున్న సమయంలో కరెంట్ షాక్‌ తీసుకుని నలుగురు చనిపోయిన దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. నలుగురు మృతిచెందడం చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

అలాగే, క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వానికి సహాయానికి ముందుకు రాండి అని పేర్కొంటూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

ఈ దుర్ఘటన తాడిపర్రులో పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగినది. మృతులను వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణగా గుర్తించారు. పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular