Sunday, April 12, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshకేంద్ర జల్ శక్తి మంత్రితో చంద్రబాబు, పవన్ భేటీ

కేంద్ర జల్ శక్తి మంత్రితో చంద్రబాబు, పవన్ భేటీ

-

Chat on WhatsApp

కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్ పాటిల్ తో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టుల గురించి చర్చించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల, ప్రాజెక్టు నిర్మాణ దశలు, అవశేష పనులపై ప్రధానంగా దృష్టి సారించారు.

పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సహాయంపై సీఎం, డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రితో చర్చించారు. ఈ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అలాగే, ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు కేంద్ర సహాయం అవసరమని కోరారు.

ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు రూ.12,000 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నిధులను త్వరగా విడుదల చేయాలని, ఏపీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రికి చంద్రబాబు వినతి పెట్టారు. అలాగే, రాష్ట్రంలో సాగునీటి వనరులను మెరుగుపరిచే విధంగా కేంద్రం నుంచి మరిన్ని పథకాలను అమలు చేయాలని సూచించారు.

ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన నీటిపారుదల ప్రాజెక్టుల కోసం కేంద్ర సహకారం కీలకమని చంద్రబాబు, పవన్ తెలిపారు. కేంద్ర మంత్రి సి.ఆర్ పాటిల్ సానుకూలంగా స్పందించారని, రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని సమాచారం. ఈ భేటీ రాష్ట్ర నీటిపారుదల రంగానికి కీలకంగా మారనుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi addressing a public rally in West Bengal during election campaign

PM Modi | ఆడబిడ్డల భద్రత పై మోడీ ధ్వజం .. ఎన్నికల ప్రసంగంలో...

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్,...
- Advertisement -
Chat on WhatsApp