ఈరోజు పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బి ఆర్ ఎస్ కార్యకర్తలు సింగరేణి కార్మికులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు.
సింగరేణి కార్మికులకు 33% లాభాల వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తు నిరసన దీక్షలో పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ , మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ కార్యకర్తలు మరియు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈరోజు గోదావరిఖని చౌరస్తా లో దీక్ష చేస్తుంటే కనీసం టెంట్ వేయకుండా అడ్డుకున్నారు .
ఈరోజు దీక్షను పోలీసులు భగ్నం చేసారు . కార్మికులకు అన్యాయం చేస్తే ఊరుకోము అంటు BRS కార్యాలయం లో దీక్ష కొనసాగించారు.