Mumbai Mayor Election: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో దీర్ఘ ఉత్కంఠ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ఫలితం తేలింది. బీజేపీ-శివసేన మధ్య కీలక పోటీ జరిగినప్పటికీ, మేయర్ పదవిని బీజేపీ సొంతం చేసుకుంది.
రీతూ తాన్డే(Ritu Tande) బీజేపీ(BJP)కి చెందిన సీనియర్ నాయకురాలు, గతంలో గహత్కోపర్ నుంచి మూడుసార్లు కౌన్సిలర్గా గెలిచి, విద్యా కమిటీ ఛైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది.
ఈ అనుభవం బీఎంసీ అభివృద్ధికి ఉపయోగపడుతుందని పార్టీ అంచనా. డిప్యూటీ మేయర్గా ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన సంజయ్ ఘడి ఎన్నికయ్యాడు.
ఈ ఎన్నికలతో ముంబై మున్సిపల్ పాలనలో బీజేపీ-శివసేన మధ్య అధికార పంపకం స్పష్టమైంది. రీతూ తాన్డే నేతృత్వంలో ముంబైకు కొత్త అడ్వాన్స్డ్ పాలన ఆశలు పెరిగాయి.
ఈ నియామకం పార్టీల మధ్య సమన్వయం, మున్సిపల్ అభివృద్ధికి కొత్త ప్రేరణ ఇస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ:TG ICET 2026 Notification | ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తుల ప్రారంభం
