admin

మహాబలిపురం రిసార్ట్‌లో బాధిత కుటుంబాలను కలిసిన విజయ్ – ఓదార్చిన టీవీకే చీఫ్

తమిళనాడు రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదుగుతున్న నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కజగం (టీవీకే) ఇటీవల తీవ్రమైన విషాద ఘటనను ఎదుర్కొంది. సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనలో 60 మందికిపైగా గాయపడగా, ఆ వెంటనే విజయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ప్రకటించి, వారి పట్ల సానుభూతి…

Read More

“అందంగా లేకపోయినా ఫరవాలేదు.. అర్థం చేసుకునే వాడై ఉండాలి” – శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తక్కువ కాలంలోనే తెలుగుతో పాటు హిందీ చిత్ర పరిశ్రమల్లోనూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’, రవితేజతో చేస్తున్న ‘మాస్ జాతర’ సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆమె ఇంటర్వ్యూలు, టీవీ షోలు, ఈవెంట్లలో పాల్గొంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శ్రీలీల తన పెళ్లి గురించి ఓపెన్‌గా మాట్లాడారు….

Read More

‘మిథాయ్’ తుపాను రేపు కాకినాడ తీరానికి..! ప్రభుత్వం అప్రమత్తం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వేగంగా బలపడి ‘మిథాయ్’ తుపానుగా మారింది. ఇది రేపు మంగళవారం ఉదయం తీవ్ర తుపానుగా మారి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ తుపాను విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 710 కి.మీ, కాకినాడకు ఆగ్నేయంగా 680…

Read More

అమరవీరుల కుటుంబాలకు రూ. కోటి ఇవ్వాలని డిమాండ్ చేసిన కవిత – “క్షమాపణ చెబుతున్నా”

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ప్రారంభించిన ‘జనం బాట’ కార్యక్రమం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఆమె హైదరాబాద్ గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి, అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలు సర్వత్రా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కవిత మాట్లాడుతూ, “అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమరవీరుల కుటుంబాలకు సరైన న్యాయం జరగలేదు” అని…

Read More

‘బాహుబలి: ది ఎపిక్’గా రీ రిలీజ్ – రెండు భాగాలు ఒకే సినిమాలో!

భారతీయ చలనచిత్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిన దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి మాస్టర్‌పీస్ ‘బాహుబలి’ మళ్లీ థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. విడుదలై దాదాపు పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, రెండు భాగాలను కలిపి రూపొందించిన కొత్త వెర్షన్ ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఈ నెల అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ కానుంది. తాజాగా చిత్ర బృందం కొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది. ఆధునిక విజువల్ టెక్నాలజీతో రీమాస్టర్ చేయబడిన ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో విపరీతమైన…

Read More

కర్నూలు బస్సు ప్రమాదం తరువాత ఆర్టీఏ అలర్ట్ – హైదరాబాద్‌లో ప్రైవేట్ బస్సులపై విస్తృత తనిఖీలు

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదం రాష్ట్రాలను కుదిపేసింది. ఈ ఘటనలో జరిగిన ప్రాణనష్టంతో భయాందోళన నెలకొనగా, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రవాణా శాఖ (ఆర్టీఏ) అధికారులు అత్యంత అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నగర పరిధిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. తాజాగా రంగారెడ్డి జిల్లా బండ్లగూడ, వనస్థలిపురం ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారులు ఆకస్మికంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 60కి పైగా ప్రైవేట్ బస్సులను తనిఖీ…

Read More