Sunday, March 29, 2026
Chat on WhatsApp
HomeUncategorizedఫైనల్ హీరో తిలక్ వర్మ – తెలుగు తేజం కోహ్లీలా మెరిశాడు!

ఫైనల్ హీరో తిలక్ వర్మ – తెలుగు తేజం కోహ్లీలా మెరిశాడు!

-

Chat on WhatsApp

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా విజయం సాధించిన నేపథ్యంలో, దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు అద్భుత సంబరాల్లో మునిగిపోయారు. అయితే, ఈ విజయంలో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి మాత్రం తిలక్ వర్మ.
తెలంగాణలోని హైదరాబాద్‌కి చెందిన ఈ యువ క్రికెటర్, అత్యంత ఒత్తిడిగా మారిన దశలో క్రీస్‌లోకి అడుగుపెట్టి మ్యాచ్‌ను అద్భుతంగా గెలిపించాడు. ముఖ్యంగా, 69 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో, తిలక్ మ్యాచ్‌ను గెలిచేలా చేసి తనను ఫైనల్ హీరోగా నిలబెట్టుకున్నాడు.

మ్యాచ్ క్రమం ఇలా సాగింది:
పాకిస్తాన్ బౌలర్లు తొలుత టీమిండియాకు షాక్ ఇచ్చారు. టాప్ ఆర్డర్ ఒక్కొక్కరుగా ఔట్ కావడంతో జట్టు ఒత్తిడిలో పడింది. అదే సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, సానుభూతితో కాకుండా సాధనతో సమాధానం ఇచ్చాడు.
అతడికి జోడీగా సంజు శాంసన్, అనంతరం శివమ్ దుబే ఉన్నా, తిలక్‌నే గేమ్‌లో తన బ్యాటుతో ఆధిపత్యం చాటాడు. ఒక్కో బంతిని నమ్మకంగా ఎదుర్కొంటూ, అవసరమైన రన్‌రేట్ పెరుగుతున్నా ఆత్మవిశ్వాసంతో ధీరంగా ఎదుర్కొన్నాడు.

ఈ ఇన్నింగ్స్ తర్వాత దేశవ్యాప్తంగా తిలక్‌పై ప్రశంసల వర్షం కురిసింది.
టీమిండియా మాజీ ఆటగాళ్లు ఆయనను విరాట్ కోహ్లీ 2022 ఇన్నింగ్స్‌తో పోల్చారు. ముఖ్యంగా ఇర్ఫాన్ పఠాన్, అతడి ఆటతీరు విరాట్ కోహ్లీను గుర్తు తెచ్చిందని అన్నారు. అలాగే, క్రికెట్ విశ్లేషకులు కూడా తిలక్ ఇన్నింగ్స్‌ను మిడిల్ ఆర్డర్‌కి కొత్త నిడర్శగా అభివర్ణించారు.

తిలక్ వర్మ – ఎందుకు ప్రత్యేకం?

  • ఒత్తిడిలోనూ పట్టు నిడానంగా ఆడే సామర్థ్యం
  • శాట్లు ఎంచుకోవడంలో స్పష్టత
  • మోస్ట్ ప్రెషర్ మోమెంట్‌లో కూల్‌గా మెలగడం
  • తన సహచరులతో భాగస్వామ్యాన్ని నిర్మించడం
  • నెమ్మదిగా ఆటను కంట్రోల్‌లోకి తేవడం

ఈ ఇన్నింగ్స్‌తో తిలక్ వర్మ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.
“తెలుగు తేజం”, “నెక్ట్స్ కోహ్లీ”, “ఫినిషర్ తిలక్” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగులు వేశారు.
తన అజేయ ఇన్నింగ్స్‌తో తిలక్ వర్మ ఈ విజయాన్ని భారత్‌కి కేవలం గెలుపుగా కాదు, గర్వంగా మార్చాడు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

telangana cm revanth reddy launching tholi mudda breakfast scheme for anganwadi children in assembly premises

Anganwadi Breakfast Scheme | సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త పథకం.....

Anganwadi Breakfast Scheme: తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారాన్ని మెరుగుపరచే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ‘తొలి ముద్ద’(Tholi Mudda) పేరుతో ప్రత్యేక...
- Advertisement -
Chat on WhatsApp