Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఉగ్రదాడి బాధితులకు పుంగనూరులో నివాళి

ఉగ్రదాడి బాధితులకు పుంగనూరులో నివాళి

-

Chat on WhatsApp

పుంగనూరు పట్టణంలో హిందూ కుల సంఘాల ఐక్యత వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో అమరులైనవారికి నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేశ భద్రత కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాలను స్మరిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

నగిరి ప్యాలెస్ నుండి ప్రారంభమైన ర్యాలీ, పట్టణంలోని ముఖ్య కూడలుల గుండా ప్రదర్శనగా సాగి ఎన్.టి.ఆర్ సర్కిల్‌ వరకు చేరింది. “ఉగ్రవాదం నశించాలి”, “అమరుల త్యాగాలు వృథా కాదు” వంటి నినాదాలతో ర్యాలీ గంభీరంగా కొనసాగింది. ప్రజలు ఉగ్రవాదాన్ని ఖండిస్తూ తమ భావోద్వేగాలను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, ఉగ్రదాడులు దేశ ఐక్యతను దెబ్బతీయలేవని, జాతీయోద్యమ భావాలను బలోపేతం చేస్తాయని తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశమైనా, ఏ వ్యక్తి అయినా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు.

ర్యాలీ ముగింపులో పాకిస్తాన్ ప్రధాని దిష్టిబొమ్మను పట్టణ వీధులలో ఊరేగించి, తరువాత దహనసంస్కారం చేశారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది యువకులు, స్థానికులు, హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పోలీసు బందోబస్తు మధ్య శాంతియుతంగా ర్యాలీ ముగిసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

indian oil tankers in strait of hormuz amid iran us tensions

Hormuz | హర్మూజ్ జలసంధిలో టెన్షన్.. నిలిచిపోయిన 9 భారత ట్యాంకర్లు..?

Hormuz: పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం సముద్ర రవాణాపైనా పడుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి మరోసారి అంతర్జాతీయ...
- Advertisement -
Chat on WhatsApp