చంద్రగిరిలో చోరీ కేసు భేదం, ఇద్దరు అరెస్ట్

Chandragiri police arrested two in a theft case, recovering ₹3 lakh, 301 grams of gold, and a scooter from the accused. Chandragiri police arrested two in a theft case, recovering ₹3 lakh, 301 grams of gold, and a scooter from the accused.

చంద్రగిరి మండలం కొత్త ఇండ్లు గ్రామంలోని శిద్దులు నాయుడు ఇంటిలో 2023 నవంబర్ 30న పగటిపూట జరిగిన చోరీ కేసులో చంద్రగిరి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసును ఛేదించి మొత్తం 301 గ్రాముల బంగారం, రూ.3 లక్షల నగదు, ఓ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.

తిరుపతి రూరల్ శ్రీనగర్ కాలనీకి చెందిన పులి నరేష్‌ ను పోలీసులు అరెస్ట్ చేయగా, అతని వద్ద నుండి 195.5 గ్రాముల బంగారం, రూ.3 లక్షలు, ఓ స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. నరేష్‌పై ఇదివరకు కూడా అనేక కేసులు నమోదు కావడంతో అతని జైలు జీవితం కొనసాగుతోంది.

ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్నాడు జిల్లా మిర్యాలకు చెందిన షేక్ బాబావలి కాగా, అతడిని సూర్యాపేట జిల్లా మునగాల పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుండి మరో 105.5 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు పరిష్కారానికి కృషిచేసిన చంద్రగిరి ఇన్‌స్పెక్టర్ సుబ్బరామిరెడ్డి నేతృత్వంలోని పోలీస్ సిబ్బందికి తిరుపతి రూరల్ డీఎస్పీ బేతంపూడి ప్రసాద్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *