Saturday, April 4, 2026
Chat on WhatsApp
HomeRangareddyLal Bahadur Nagaఎల్బీనగర్‌లో పాత కక్షలతో యువకుడు కత్తితో హత్య

ఎల్బీనగర్‌లో పాత కక్షలతో యువకుడు కత్తితో హత్య

-

Chat on WhatsApp

ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గతంలో పాత కక్షల కారణంగా సంజయ్ మరియు మనోజ్ మధ్య గొడవలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ గొడవలో సంజయ్, మనోజ్, సంజీవ్ లతో ఉన్న కేసు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో నమోదైంది.

ఈ కేసులో పెద్దలు మధ్యలో చేరి, 3 లక్షల రూపాయలు సంజయ్‌కు ఇమ్మని సమస్య పరిష్కరించారు. కానీ సంజయ్, ఈ సమస్యపై సమయం గడిచిన తరువాత తన తోటి స్నేహితులతో కలిసి మనోజ్‌ను విచక్షణారహితంగా కత్తులతో పొడిచి చంపడం జరిగిందని పోలీసులు తెలిపారు.

మధు అనే స్నేహితుడు ఈ సంఘటనను పోలీసులకు వెల్లడించాడు. ఈ ఘటనపై చైతన్యపురి సీఐ వెంకటేశ్వర్లు స్పందించి, చనిపోయిన మనోజ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అలాగే కేసు నమోదు చేసి, చంపిన వారిపై దర్యాప్తు చేపట్టారు.

ఇప్పటికే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ హత్య వెనుక ఉన్న పాత కక్షలను పరిశీలిస్తూ, మరిన్ని ఆధారాలు సేకరించాలని పోలీసులు చెప్పారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

deloitte hiring 50000 employees in india amid global tech layoffs and ai transition

Deloitte Hiring | లేఆఫ్స్ ఒకవైపు.. హైరింగ్ మరోవైపు.. భారత్‌పై డెలాయిట్ భారీ ఫోకస్

Deloitte Hiring: టెక్ రంగంలో ఒకవైపు భారీగా ఉద్యోగాల కోతలు కొనసాగుతుండగా, మరోవైపు నియామకాల అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 ఉద్యోగాలను తగ్గించినట్లు నివేదికలు వెలువడగా, అదే...
- Advertisement -
Chat on WhatsApp