Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeNationalఅజ్మీర్ షరీఫ్ ఉత్సవాలకు గిలబు ఊరేగింపు

అజ్మీర్ షరీఫ్ ఉత్సవాలకు గిలబు ఊరేగింపు

-

Chat on WhatsApp

రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ షరీఫ్ దర్గా ఉత్సవాలు జనవరి 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగుతుండగా, ఈ రోజు గిలబును ఊరేగింపుగా పంపించడం జరిగింది. ఈ ఉత్సవాలలో భాగంగా, మాసూకీ రబ్బాని దర్గా పీఠాధిపతి బాబా గిలబును అతి వైభవంగా పూజలు నిర్వహించి, ఊరేగింపుగా పంపించారు.

వరంగల్ నగరం కరీమాబాదులోని దర్గాలో ప్రతి సంవత్సరం అజ్మీర్ షరీఫ్ దర్గా ఉత్సవాలకు గిలబు అందించబడుతుంది. ఈ ఉత్సవంలో గిలబును ప్రత్యేకంగా పూజించి, నగర పురవీధుల గుండా ఊరేగింపుగా పంపించి, అజ్మీర్ షరీఫ్ దర్గాకు తరలించడం జరిగింది.

ఈ ఉత్సవంలో ఆశుకు రబ్బాని దర్గా పీఠాధిపతి బాబా, నసిరుద్దీన్ జాకీర్ మొహినుద్దీన్ వంటి ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు ప్రతి సంవత్సరం రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ షరీఫ్ దర్గా ఉత్సవాలకు వరంగల్ నుండి గిలబును పంపించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

గత 27 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతూ వస్తోంది. ప్రతీ ఏడాది, అజ్మీర్ షరీఫ్ ఉత్సవాలకు వరంగల్ నగరంలోని మాషూకీ రబ్బాని దర్గా నుండి గిలబును ప్రత్యేక పూజలతో ఊరేగింపుగా పంపిస్తారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nothing Phone 4b

Nothing Phone 4b లాంచ్.. 6000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ప్రత్యేక డిజైన్‌తో గుర్తింపు పొందిన Nothing సంస్థ మరో కొత్త డివైస్‌ను పరిచయం చేసింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా 'B' సిరీస్‌లో భాగంగా Nothing Phone 4bను విడుదల...
- Advertisement -
Chat on WhatsApp