Thursday, March 19, 2026
No menu items!
spot_img
HomeRangareddyLal Bahadur Nagaఎల్బీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడి సంచలనం

ఎల్బీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడి సంచలనం

-

డ్రగ్స్ నియంత్రణకు పోలీసులు, ప్రభుత్వం నడుమ తీసుకుంటున్న కఠిన చర్యలతోపాటు భారీ కృషి చేసినా సరఫరా మాత్రం కొనసాగుతూనే ఉంది. డ్రగ్ సరఫరాదారులు పోలీసుల హెచ్చరికలను కూడా పట్టించుకోకుండా, చిక్కిపోవడం, కొంతకాలం గ్యాప్ ఇచ్చి మళ్లీ సరఫరా చేయడం సాధారణం అయింది. ప్రత్యేకించి యువత ఈ రహదారిని ఎంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. వారిలో చాలా మంది విలాసవంతమైన జీవితం గడపాలనే ఆశతో డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు.

తాజాగా ఎల్బీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడిన ఘటన సంచలనం సృష్టించింది. రాచకొండ పోలీసులు ఎల్బీనగర్ జోన్ SOT టీంతో కలిసి మీర్‌పేట్‌లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో నిందితుల వద్ద నుండి కోటి 25 లక్షల రూపాయల విలువైన 53.5 కిలోల గసగసాల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాను ఛేదించడంతో డ్రగ్ రవాణా నెపథ్యంలోని కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.

డ్రగ్స్‌ను మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టు నిర్ధారించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గసగసాలతో పాటు ఇతర మాదక ద్రవ్యాలను సరఫరా చేయడంలో వీరి పాత్ర ఉన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఎల్బీనగర్ క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన మీడియా సమావేశంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

పోలీసుల సకాల చర్యలతో డ్రగ్ సరఫరాదారుల పై ఒత్తిడి పెరుగుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు, డ్రగ్స్ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు.

- Advertisement -
- Advertisment -

Must Read

oil and gas storage tanks representing india energy security monitoring system

India energy security | ఇంధన భద్రతపై కేంద్రం అలర్ట్‌.. ఆయిల్ కంపెనీలకు కీలక...

India energy security: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరా అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో చమురు మరియు సహజ వాయువు సంస్థలకు కీలక...