Sunday, March 29, 2026
Chat on WhatsApp
HomeNationalస్టాక్ మార్కెట్లలో భారీ పతనం, రూ.5.3 లక్షల కోట్లు నష్టం

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం, రూ.5.3 లక్షల కోట్లు నష్టం

-

Chat on WhatsApp

భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఈ ఒక్కరోజే రూ.5.3 లక్షల కోట్లు తగ్గింది. సెన్సెక్స్ ఏకంగా 1017 పాయింట్లు క్షీణించి 81,183 వద్ద, నిఫ్టీ 292 పాయింట్లు నష్టపోయి 24,852 వద్ద స్థిరపడింది. అమెరికా ఫెడ్ రేటు తగ్గింపు అంచనాలు, యూఎస్ ఉద్యోగ నివేదికకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు.

మార్కెట్ భారీ పతనం కారణంగా బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.5.3 లక్షల కోట్లు తగ్గి రూ.460.04 కోట్ల వద్ద ఉంది. గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.465.3 లక్షల కోట్లుగా ఉంది.

సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్, టాటా మోటార్స్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంకు, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టి, మహింద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజకీ, అల్ట్రా టెక్ సిమెంట్, విప్రో భారీగా నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పేయింట్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, హెచ్‌యూఎల్ లాభాల్లో ముగిశాయి.

మార్కెట్ అననుకూలత కారణంగా అన్ని రంగాల్లోనూ పెద్ద ఎత్తున విక్రయాలు కనిపించాయి. ఆటో, పీఎస్‌యూ బ్యాంకులు, ఫిన్ సర్వీస్, మీడియా, ఎనర్జీ, ప్రైవేటు బ్యాంకులు, ఇన్‌ఫ్రా, రియాల్టీ, ఎఫ్ఎంసీజీ సూచీలు అత్యధికంగా నష్టపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 946 పాయింట్లు, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 244 పాయింట్లు క్షీణించింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

telangana cm revanth reddy launching tholi mudda breakfast scheme for anganwadi children in assembly premises

Anganwadi Breakfast Scheme | సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త పథకం.....

Anganwadi Breakfast Scheme: తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారాన్ని మెరుగుపరచే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ‘తొలి ముద్ద’(Tholi Mudda) పేరుతో ప్రత్యేక...
- Advertisement -
Chat on WhatsApp