Monday, April 6, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshశ్రీకాకుళంలో పంటనష్టం నమోదుకు గడువు పొడిగింపు – అచ్చెన్నాయుడు కీలక నిర్ణయం

శ్రీకాకుళంలో పంటనష్టం నమోదుకు గడువు పొడిగింపు – అచ్చెన్నాయుడు కీలక నిర్ణయం

-

Chat on WhatsApp

శ్రీకాకుళం జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో రైతులు ఎదుర్కొన్న పంటనష్టంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంటనష్టం నమోదుకు గడువు మరో రెండు రోజులు పొడిగించినట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.

ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ-క్రాప్‌ నమోదు వందశాతం పూర్తయిందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తుఫాన్‌ వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఈ-క్రాప్‌ నమోదు జరగలేదని చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని మంత్రి తీవ్రంగా విమర్శించారు.

“జగన్‌కి నచ్చిన ఏ ప్రాంతానికైనా రావచ్చు, నేనూ వస్తా. ఈ-క్రాప్‌ నమోదు పూర్తయిందని నిరూపిస్తా,” అంటూ అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు.

శ్రీకాకుళం జిల్లా సమీక్ష మండలి సమావేశంలో మాట్లాడిన ఆయనతో పాటు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

adivi sesh and mrunal thakur in dacoit movie trailer scene

Dacoit Movie | డెకాయిట్‌ మూవీ ట్రైలర్ విడుదల…అడివి శేష్, మృణాల్ కేమిస్ట్రీ హైలైట్

Dacoit Movie: అడివి శేష్‌ హీరోగా రాబోయే రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్‌’ ట్రైలర్ విడుదల అయింది. ఈ చిత్రాన్ని షానీల్ డియో దర్శకత్వం వహించారు. హీరోగా అడివి శేష్‌, హీరోయిన్‌గా మృణాల్...
- Advertisement -
Chat on WhatsApp