Saturday, February 21, 2026
spot_img
HomeOthersమెంగళసూత్రం, బొట్టు పై జడ్జి వ్యాఖ్యలు – వివాదాస్పద చర్చ

మెంగళసూత్రం, బొట్టు పై జడ్జి వ్యాఖ్యలు – వివాదాస్పద చర్చ

వేర్వేరుగా ఉంటున్న దంపతుల మధ్య సామరస్యాన్ని నెలకొల్పే క్రమంలో ఓ జడ్జి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత తీసుకురావడానికి ప్రయత్నించిన జడ్జి, ఆ వివాహిత మహిళపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నీ మెడలో మంగళసూత్రం లేదు, నుదుటిపై బొట్టు పెట్టుకోలేదు… ఇలా ఉంటే భర్తకు నీపై ఆసక్తి ఎందుకు కలుగుతుంది?” అని ప్రశ్నించినట్టు పూణేకి చెందిన న్యాయవాది అంకుర్ ఆర్ జాగీర్దార్ తెలిపారు.

గృహ హింస కేసులో సంబంధిత జడ్జి మధ్యవర్తిత్వం వహించాలని కోర్టు నియమించిందని ఆయన తెలిపారు. దంపతులు కలిసేలా చేయడానికి ప్రయత్నిస్తూ, భార్య వైఖరిపై జడ్జి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు పేర్కొన్నారు. “పెళ్లైన మహిళగా ఉంటే, మంగళసూత్రం ధరించడం, బొట్టు పెట్టుకోవడం సహజమే. అలా కాకపోతే వివాహితలా కనిపించకపోవచ్చు” అంటూ వ్యాఖ్యానించారని వివరించారు.

ఇదే విధంగా, మరో వివాహ గొడవలో జడ్జి మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. “ఒక మహిళ ఎక్కువ సంపాదిస్తే, తనకంటే ఎక్కువ సంపాదించేవాడిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. కానీ, ఒక పురుషుడు ఎంత సంపాదించినా తనకంటే తక్కువ సంపాదించే మహిళను పెళ్లి చేసుకోవచ్చు. ఇదే పురుషుల సరళత” అని వ్యాఖ్యానించినట్టు న్యాయవాది తెలిపారు.

ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కొన్ని వర్గాలు జడ్జి వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, మరికొంత మంది విమర్శిస్తున్నారు. మహిళలు కూడా పురుషుల్లా సరళంగా ఉండాలని చెప్పడం కరెక్టా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై అధికారిక వివరణ రావాల్సి ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular