Thursday, March 26, 2026
Chat on WhatsApp
HomeNationalఫుడ్ డెలివరీలో పొరపాటు… సినీ నటి సాక్షి అగర్వాల్‌కి చేదు అనుభవం

ఫుడ్ డెలివరీలో పొరపాటు… సినీ నటి సాక్షి అగర్వాల్‌కి చేదు అనుభవం

-

Chat on WhatsApp

తమిళ సినీ నటి సాక్షి అగర్వాల్‌కు ఇటీవల ఓ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఊహించని అనుభవం ఎదురైంది. తాను పుట్టినప్పటి నుంచి కచ్చితమైన శాకాహారి అని చెప్పుకునే సాక్షి, తాను ఆర్డర్ చేసిన వంటకంలో చికెన్ ముక్కలు రావడం చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాక్షి వివరాల ప్రకారం—తనకు బాగా ఆకలి వేసి, ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి స్విగ్గీ ద్వారా పనీర్ కర్రీ ఆర్డర్ చేశారు. ఆహారం ఇంటికి డెలివరీ అయిన తర్వాత తినడం ప్రారంభించగా, పనీర్ ముక్కలతో పాటు చికెన్ ముక్కలు కూడా కనిపించాయి. ఈ దృశ్యం చూసి ఆమె షాక్‌కు గురయ్యారు. తాను పుట్టినప్పటి నుంచి శాకాహారమే తింటున్నానని, కానీ ఇలాంటిది జరగడం చాలా బాధ కలిగించిందని సాక్షి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై ఆమె సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టారు. “నా జీవితంలో ఎప్పుడూ మాంసాహారం ముట్టని నేను, ఇలా బలవంతంగా చికెన్ తినాల్సి రావడం చాలా దారుణం. శాకాహారి ఆర్డర్‌ను మాంసాహారంతో కలిపి పంపడం అంటే ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, శాకాహారుల మనోభావాలను కూడా దెబ్బతీసే చర్య” అంటూ రెస్టారెంట్‌పై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఆమె చేసిన ఈ పోస్ట్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు సాక్షికి మద్దతు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. “ఇది చాలా సున్నితమైన విషయం. రెస్టారెంట్లు, డెలివరీ సంస్థలు కస్టమర్ల ఆర్డర్లను పంపే సమయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి” అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొందరు అయితే ఇలాంటి తప్పిదాలపై భారీ జరిమానాలు విధించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనతో ఫుడ్ డెలివరీ యాప్‌లు, రెస్టారెంట్లు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చాలా మంది చెబుతున్నారు. ఎందుకంటే ఒక చిన్న తప్పిదం, కస్టమర్ల ఆహార అలవాట్లను, నమ్మకాలపై ప్రభావం చూపుతుంది.

సాక్షి అగర్వాల్ ఇప్పటికే ఈ విషయాన్ని సంబంధిత సంస్థల దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఈ విషయం ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp