Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeCrime Newsకాట్రియాలలో మంత్రాల పేరుతో దారుణ హత్య

కాట్రియాలలో మంత్రాల పేరుతో దారుణ హత్య

-

Chat on WhatsApp

మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో మంత్రాలు చేస్తుందని నెపంతో అదే గ్రామానికి చెందిన ధ్యాగల ముత్తవ్వను అతి దారుణంగా కట్టెలతో కొట్టి చంపి, పెట్రోల్ పోసి హత్య చేసిన ఆరుగురిని శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అరెస్టు అయిన వారిలో ద్యాగల మురళి, ధ్యాగల రామస్వామి, ద్యాగల శేఖర్, ధ్యాకల రాజలత, ద్యాగల లక్ష్మి, ధ్యాగల పోచమ్మ, లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ వెంకట రాజా గౌడ్ మాట్లాడుతూ ద్యాగల ముత్తవ్వ అనే మహిళ అదే గ్రామానికి చెందిన మరో మహిళకు బాణామతి చేయడం వల్ల ద్యాగల పోచమ్మ ఆరోగ్యంగా బాగా లేకపోవడంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుందని మూడవ తేదీ నాడు రాత్రి 8:30 గంటల నుండి ఏడుగురు వచ్చి ముత్తవ్వ ఇంటికి వెళ్లి ఆమెను కట్టెలతో తలపై కొట్టగా తల పగిలిందని ఆయన తెలిపారు. తల పగిలి అప్పటికే ఆమె మృత్యువాత పడిందన్నారు. వెంటనే పెట్రోల్ పోసి ముత్తవను తగుల పెట్టినట్లు తెలిపారు. మూఢనమ్మకాలు గ్రామాలలో నమ్మవద్దని ఎవరైనా ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సి ఐ వెంకట రాజా గౌడ్ తో పాటు రామాయంపేట ఎస్సై బాలరాజు ఉన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nitish Kumar moves to Rajya Sabha, triggering leadership change debate in Bihar

Nitish Kumar |రాజ్యసభకు నితీష్ కుమార్.. బీహార్‌లో కొత్త సీఎం ఎవరు?

Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు తిరగనుంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన నితీష్ కుమార్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈరోజు ఆయన రాజ్యసభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం...
- Advertisement -
Chat on WhatsApp